అన్నదాత సుఖీభవ పథకం ముహూర్తం ఫిక్స్! ఈ చిన్న పని చేయకపోతే రూ.20 వేలు కట్!
Fri Jun 13, 2025 11:00 Politics.202506132331.jpg)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ప్రారంభించిన "అన్నదాత సుఖీభవ" పథకం కింద ఈ నెల 20న మొదటి విడతగా రూ.7,000ను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకం ద్వారా eligible రైతులకు ఏడాదికి మొత్తం రూ.20,000 ఆర్థిక సహాయం అందుతుంది. ఇందులో రూ.14,000 రాష్ట్ర ప్రభుత్వం నుండి, రూ.6,000 కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకం ద్వారా వస్తుంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా జమ చేస్తారు – మొదటి విడత రూ.7,000 (రూ.5,000 రాష్ట్రం, రూ.2,000 కేంద్రం), రెండో విడత మరో రూ.7,000, మూడో విడతగా రూ.6,000 ఇవ్వనున్నారు. రైతులు ఈ మొత్తాన్ని పొందాలంటే, ఈ నెల 20లోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!
ఈ-కేవైసీ ప్రక్రియ రైతు సేవా కేంద్రాల్లో ఓటీపీ లేదా బయోమెట్రిక్ విధానంలో చేయవచ్చు. అంతేకాక, పీఎం కిసాన్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా కూడా ఆధార్ ఓటీపీ లేదా ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తిచేయొచ్చు. అధికారులు ప్రాథమికంగా అర్హుల జాబితాను తయారు చేసి, జిల్లా స్థాయిలో రైతుల వివరాలను పరిశీలించి, చివరికి తుది జాబితాను రైతు సేవా కేంద్రాలకు పంపిస్తారు. వెబ్ల్యాండ్ డేటా ఆధారంగా భూమి వివరాలు, సర్వే నంబర్లు చూసి తప్పులుంటే సరి చేస్తారు. అనర్హులైన రైతులను జాబితా నుంచి తొలగిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం సాయం అందించనుంది.
ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తల్లికి వందనం లిస్ట్ లో మీ పేరు రాలేదా? వెంటనే ఈ పని చేయండి! ఆఖరి తేదీ..
మృతుల కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్! ఒక్కొక్కరికి...
వాకింగ్ ఎంత సేపు చేయాలి! అతిగా నడిస్తే ఏం జరుగుతుంది?
10 నిమిషాల ఆలస్యమే తన ప్రాణాలు కాపాడింది! లక్ అంటే ఇదే మరి!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం! ప్రయాణికులే కాదు... చదువుకుంటున్న డాక్టర్లు కూడా.. తెలుగు వారు?
ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రూ.550 కోట్లతో అధునాతన క్యాన్సర్ ఆస్పత్రి!
టాటా నానో రీఎంట్రీ! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
వైసీపీకి దిమ్మదిరిగే షాక్! సాక్షి ఛానల్ పై కేసు నమోదు!
లోకేష్ కి ప్రమోషన్ ఎప్పుడు! చంద్రబాబు ఏమన్నారంటే?
దుబాయ్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ డ్రైవ్! నెలకు సుమారు రూ.10 లక్షలు! వెంటనే అప్లై చేసుకోండి!
తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!
బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AndhraPradeshFarmers #FarmerWelfare #PMKisanUpdates #EKYCAlert #APGovtSchemes #RythuSadhikara #FinancialSupportToFarmers #FarmersFirst #DirectBenefitTransfer #AgricultureSupport #JaganannaSchemes #FarmerIncomeSupport #EKYCDeadline #APFarmersWelfare
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.